వైయ‌స్ జ‌గ‌న్ విస్తృత ప‌ర్య‌ట‌న

పులివెందుల‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం వైయ‌స్ఆర్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. క‌డ‌ప న‌గ‌రంలోని దేవుని క‌డ‌ప‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అలాగే పులివెందుల‌లో సైదాపురం ఓబుల్‌రెడ్డి కుమార్తె వివాహ వేడుక‌ల్లో పాల్గొన్నారు. అనంత‌రం అల‌మ‌ల‌పాడు వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి కుమారుడి వివాహ వేడుక‌ల్లో పాల్గొని నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. అక్క‌డి నుంచి ఆయ‌న వ్య‌క్తిగ‌త పీఏ ర‌విశేఖ‌ర్ ఇంటికి వెళ్లారు. ఇటీవ‌ల ర‌విశేఖ‌ర్ భార్య మృతి చెందాడంతో వైయ‌స్ జ‌గ‌న్ ర‌విశేఖ‌ర్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. బంధువుల‌కు ధైర్యం చెప్పారు.

Back to Top