కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ సీఎం కావాల్సిందే
18 Aug 2018 5:02 PM
విశాఖ: ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని పెట్ల ఉమాశంకర్ పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన సభలో వైయస్ఆర్సీపీ నాయకుడు పెట్ల ఉమాశంకర్ మాట్లాడారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజల తరఫున వైయస్ జగన్ నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మొదటి నుంచి చిత్తశుద్ధితో వైయస్ జగన్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. పది మాసాలుగా పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమం ద్వారా ఏ గ్రామానికి వెళ్లినా చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లు వేసి మోసపోయామని ప్రజలు చెప్పారన్నారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో ట్యాక్స్ల భారం మోపి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. స్థానికంగా మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అయ్యన్నపాత్రుడుకు రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే వైయస్ జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు.