కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా ముద్దవరం గ్రామంలో వైయస్ జగన్ వైయస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించనున్నారు. జననేత కోసం గ్రామస్తులు పనులు మానుకొని ఎదురుచూస్తున్నారు. అడుగడుగునా వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.