చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
విద్యార్థి ఆత్మహత్యపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
18 Sep 2018 10:11 AM
విశాఖపట్నం : ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడం వల్లే తన అన్నకు ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది మహేంద్ర(14) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న వైయస్ జగన్ ఈ సంఘటన తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తప్పక ప్రత్యేకహోదా సాధిస్తుందని ఆయన తెలిపారు. కాబట్టి యువత సంయమనం పాటించాలని ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని వైయస్ జగన్ కోరారు.