ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

శ్రీహరికోట:  పీఎస్‌ఎల్వీ సీ-36 ప్రయోగం విజయవంతమైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో శాస్త్రవేత్తలను వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అభినందించారు. శాస్త్రవేత్తలను కృషిని ఆయన కొనియాడారు.  భవిష్యత్తులో శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-36 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.  1235 కిలోల రిసోర్స్ శాట్‌-2ఏ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ-36 నింగిలోకి తీసుకెళుతోంది. మొత్తం నాలుగు దశల్లో ఈ ప్రయోగం పూర్తి కానుంది.

దీనికోసం సోమవారం రాత్రి 10.25 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 36 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 17.9 నిమిషాల్లో చేయనున్నారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ-36 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా 321 టన్నుల బరువును తీసుకుని రాకెట్ భూమి నుంచి నింగికి పయనమైంది.

Back to Top