వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ అప్పుడే హెచ్చరించారు
12 May 2016 4:08 PM
కర్నూలు: రాజకీయాల కోసం చంద్రబాబు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని వైయస్సార్సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన జరిగితే జల వివాదాలు వస్తాయని తమ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించినా.... ఎవరూ పట్టించుకోలేదని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంత మాట్లాడారు. గోదావరి, కృష్ణా జలాలపైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధారపడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈ నెల 16,17,18 తేదీల్లో కర్నూలు కేంద్రంగా దీక్ష చేపట్టనున్నారు.
To read this article in English: http://bit.ly/1OkHgaT