నేటి వైయస్ జగన్‌ పర్యటన రద్దు

విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి విశాఖ పర్యటన రద్దయినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. శారదా పీఠంలో జరుగుతున్న వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో జగన్‌ పర్యటన రద్దు అయినట్లు అమర్‌నాథ్‌ వెల్లడించారు.

Back to Top