వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయస్ జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. హైద‌రాబాద్ నుంచి నేరుగా మధ్యాహ్నం 12:30 గంటలకు విశాఖ‌ చేరుకోనున్నారు. అదృశ్యమైన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం బాధిత కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారైంద‌ని పార్టీ ప్రోగ్రామ్ ల విభాగం కోర్డినేట‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శిల ర‌ఘురాం వెల్ల‌డించారు. 

ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్‌ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు. గల్లంతయిన వారిలో 8 మంది ఎన్ఏడీ సివిల్ ఉద్యోగులు, ఒక ఛార్జ్మన్ ఉన్నారు. విమానం ఆచూకీ తెలియ‌క బాధిత కుటుంబ‌స‌భ్యులు ఆందోళన చెందుతున్నారు. 

తాజా వీడియోలు

Back to Top