విజయసాయిరెడ్డిని పరామర్శించిన వైయస్ జగన్

హైదరాబాద్ః వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఆయన సతీమణి భారతి పరామర్శించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయసాయిరెడ్డితో పాటు ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని కూడా ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై  వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా నిన్న రోడ్డు ప్రమాదంలో విజయసాయిరెడ్డి, దుర్గాప్రసాద రాజులు తీవ్రంగా  గాయపడిన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో వారికి తీవ్రగాయాలు కాగా అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైయస్ జగన్ తో పాటు పలువురు పార్టీ నేతలు విజయసాయిరెడ్డిని పరామర్శించారు.


To read this article in English:  http://bit.ly/1Nqi2rr 


Back to Top