నాయీ బ్రాహ్మణులను బెదిరించడం గర్హనీయం

న్యాయమైన డిమాండ్లపై ఒక సీఎం స్పందించాల్సిన తీరు ఇదేనా?
వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే చిరునవ్వులు కనిపించేలా వేతనం
ప్రతీ దేవాలయ బోర్డులో నాయీ బ్రాహ్మణుడికి చోటు

హైదరాబాద్‌: తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు బెదిరించడం గర్హనీయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైయస్‌ జగన్‌ స్పందింస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘మనం నాగరికంగా ఉండాలంటే నాయీ బ్రాహ్మనుల సేవలు పొందడం తప్పనిసరి. అలాంటి నాయీ బ్రాహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను. తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం గర్హనీయం. పైగా తలనీలాలు తీసేందుకు రూ. 25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబు హావభావాలు ఆయనలోని అహంకారణ, నియంత స్వభావాలను కళ్లకుకట్టినట్టు చూపించాయి. చంద్రబాబుగారికి బీసీల పట్ల కపటప్రేమ మరోసారి వెల్లడైంది. ప్రతిరోజూ ఆలయంలో ఒక నాయీ బ్రాహ్మణుడు మహా అయితే 10–15 మందికి తలనీలాలు తీస్తారు. భక్తుల రద్దీ ఉంటేనే అది కూడా సాధ్యం. భక్తులు రాకపోతే గుడిని నమ్ముకున్న తమ బతుకుల పరిస్థితి ఏంటని అడుగుతున్న నాయీ బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా..? కనీస వేతనాలు ఇవ్వనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పడం చట్టానికి వ్యతిరేకం. దేవుడి దయతో మన ప్రభుత్వం రాగానే మీ అందరి ముఖంలో చిరునవ్వులు కనిపించేలా కనీస వేతనం ఇస్తాం. ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా తిరుమల తిరుపతి దేవవస్థానం సహా ప్రతి దేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం’ అని ట్విట్‌ చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top