శుక్ర‌వారం గుంటూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

గుంటూరు : ప‌్ర‌తిప‌క్ష నేత‌,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న గుంటూరు జిల్లా లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారు అయింది.  గుంటూరు నగరం లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో భవన నిర్మాణ పనులు చేస్తూ మట్టి పెళ్లలు విరిగిపడి ఏడుగురు కూలీలు సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. ఆ మృతుల కుటుంబాలను పరామర్శిస్తార‌ని పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజ శేఖర్, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తెలిపారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటార‌ని ఆయ‌న తెలిపారు. 

Back to Top