మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అవివేకంగా మాట్లాడొద్దు..!
06 Oct 2015 3:41 PM
గుంటూరుః ఏపీకి ప్రత్యేకహోదాను సాధించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డులో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేరుగ నాగార్జున తదితరులు దీక్షాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. దీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.
ఈసందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ....టీడీపీ నేతలు ప్యాకేజీలు పంచుకోవడానికే హోదాను విస్మరించారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజల మనోభవాలను తెలిపేందుకే వైఎస్ జగన్ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. విజయనగరం విమానాశ్రయం వద్ద వైఎస్ జగన్ కు భూములున్నాయని టీడీపీ నేతలు అవివేకంగా మాట్లాడుతున్నారని బొత్స అన్నారు. జగన్ కు సెంటు భూమి ఉందని నిరూపించినా రాజకీయంగా దేనికైనా సిద్ధమని బొత్స సవాల్ విసిరారు. నిరూపించకపోతే టీడీపీ నేతలు తమ భూములను పేదలకు పంచుతారా అని ప్రశ్నించారు.