వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అన్నదాతకు అండగా వైయస్ జగన్
27 Sep 2016 1:20 PM
()వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
()నీటమునిగిన పంటల పరిశీలన
గుంటూరుః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రెండో రోజు వరద ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ, నిరాశ్రయులైన బాధితులను పరామర్శిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. కాసేపటి క్రితమే వైయస్ జగన్ అనుపాలెం గ్రామానికి చేరుకొని నీటమునిగిన పంటలను పరిశీలించారు. అదేసమయంలో కొండమోడు వాగును పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు రుణాలు మాఫీ చేయకపోవడంతో బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ పంటలు వేసిన రైతులకు కన్నీరే మిగిలింది. భారీ వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటలు వరద నీట మునగడంతో అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈసందర్భంగా రైతులకు తోడుగా నిలిచేందుకు వైయస్ జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇంతవరకు అధికారులు గానీ, పాలకులు గానీ ఎవరూ తమ వద్దకు రాలేదని రైతులు వైయస్ జగన్ వద్ద వాపోయారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు.