నరసాపురం అర్బన్ : పోలవరం ప్రాజెక్ట్ పనులపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణిని అవలంభించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. శనివారం హైదరాబాద్లో జగన్మోహన్రెడ్డిని కలసిన కొత్తపల్లి, పార్టీ చింతలపూడి కన్వీనర్ ఘంటా మురళి జిల్లాలో పార్టీ నిర్మాణంతో సహా పలు ప్రజాసమస్యలపై చర్చించారు. వివరాలను కొత్తపల్లి ఫోన్లో విలేకరులకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని, ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లకు కొద్ది నెలలుగా జీతాలు కూడా చెల్లించకపోవడంతో ఆందోళనలో ఉన్నారని, మరోవైపు ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు పనులను శరవేగంగా నిర్వహిస్తోందనే విషయూలను పార్టీ అధినేతతో చర్చించినట్టు కొత్తపల్లి తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పను లు నిలుపుదల చేయడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని, దీనిపై పార్టీ పరంగా మరింత పోరాడి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పారని వివరించారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, నిర్మాణంపై జగన్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. <strong>పొగాకు, పామారుుల్ రైతుల సమస్యలు జగన్ దృష్టికి</strong>చింతలపూడి : జిల్లాలో పొగాకు రైతులు, పామారుుల్ రైతుల సమస్యలను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ పార్టీ చింతలపూడి నియోజకవర్గ కోఆర్డినేటర్ ఘంటా మురళీరామకృష్ణ తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడితో కలిసి జగన్ను కలిశారు. రైతుల సమస్యలపై మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లి రైతులకు అండగా ఉంటానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.