కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పిల్లలకు స్కూల్ దగ్గరగా ఉంటేనే మంచిది: వైఎస్ జగన్
27 Mar 2015 1:35 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటుతో ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ స్కూళ్ల అంశంపై చర్చ జరిగింది. మండలానికి ఒక్క స్కూలే ఉంటే ఎలా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పిల్లలకు స్కూల్ దగ్గరగా ఉంటేనే మంచిదని, ఒక కిలోమీటర్లోపే పాఠశాల ఉంటే బాగుంటుందన్నారు. స్కూల్ దూరంగా ఉంటే డ్రాప్ అవుట్స్ ఉంటాయని, పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం ఇస్తూ పిల్లలకు ఇబ్బంది లేకుండా, వారి విద్యకు ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.