మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
4న వైయస్ జగన్ రైతు మహాధర్నా
30 Sep 2016 12:59 PM
అనంతపురం : రైతుల సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైయస్ జగన్ పోరుబాట పట్టారు. అక్టోబర్ 4వ తేదీన అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలసి వైయస్ జగన్ మహాధర్నా నిర్వహించనున్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా వైయస్ జగన్ ధర్నాను విజయవంతం చేయాలని అనంతరపురం జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు శంకర్నారాయణ ప్రజలకు పిలుపు నిచ్చారు.
అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడామని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై వైయస్ జగన్ మహాధర్నా చేపట్టనున్నట్టు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.