కదిరి నుంచి ప్రారంభమైన రైతు భరోసా యాత్ర

అనంతపురంః ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా కల్పించేందుకు...అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ చేపట్టిన ఐదోవిడత రైతు భరోసా యాత్ర  నాలుగో రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం కదిరి నుంచి జననేత యాత్ర ప్రారంభమైంది.

అక్కడి నుంచి ఆయన గాండ్లపెంటకు చేరుకోగా... పార్టీశ్రేణులు, ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్  వారికి అభివాదం చేస్తూ ఎన్‌పీ కుంట దిశగా సాగారు.  ఎన్‌పీ కుంట మండలంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి పరిహారం లభించని బాధిత రైతులతో వైయస్ జగన్ సమావేశం కానున్నారు.

తాజా వీడియోలు

Back to Top