దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
సేవకుడంటే వైయస్ జగన్
07 Jul 2018 5:05 PM
తూర్పు గోదావరి: సేవకుడంటే వైయస్ జగన్ అని వైయస్ఆర్సీపీ నాయకుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం రామచంద్రాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వాతావరణంతో సంబంధం లేదు..అన్నా..నీ వెంటే ఉంటామని వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చారన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడి గుండె ఆగిపోకుండా కాపాడిన మహానీయుడు వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఎంతో మందిని ఉన్నత చదువులు చదివించారన్నారు. మహానేత మరణాంతరం రాష్ట్రం అధకారంలో ఉందన్నారు. అసెంబ్లీలో వైయస్ జగన్ను మాట్లాడకుండా చేసినా..ప్రజలంతా వైయస్ జగన్ వెంటే ఉన్నారని చెప్పారు. ప్రజలను ఆదుకునేందుకు వైయస్ జగన్ నవరత్నాలు తెచ్చారని తెలిపారు. ప్రజా సంకల్పం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సేవకుడంటే జగనన్న అని నినదించారు.