వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ అంటే నమ్మకం
08 Aug 2017 5:31 PM
- బాబు అంటే మోసం..దగా
- బాబు మోసపూరిత వాగ్ధానాలు నమ్మొద్దు
- నంద్యాల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకమని, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైయస్ జగన్ అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు. చంద్రబాబు అంటే మోసం, దగా అని, నంద్యాల ఉప ఎన్నిక నమ్మకానికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, ఇందులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎవరినైనా సులువుగా మోసం చేసే నైజమన్నారు. మూడున్నరేళ్లుగా నంద్యాలను పట్టించుకోని సీఎం ఇవాళ ఉప ఎన్నిక వచ్చిందని రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేశారన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఈ హామీలను తుంగలో తొక్కుతారని విమర్శించారు. గతంలో శిల్పా మోహన్రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో దీబగుంట్లలో జరిగిన మీటింగ్లో నంద్యాల రోడ్ల విస్తరణపై బాబును కోరగా, అప్పట్లో డబ్బులు లేవన్నారన్నారు. ఇప్పుడేమో శంకుస్థాపనలు చేశారన్నారు.సొంత మామనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. నవ నందుల మధ్య ఉన్న నంద్యాల ప్రజలు తెలివిని ప్రదర్శించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, మీరు వేసే ఓటు వచ్చే ఎన్నికలకు నాంది కావాలన్నారు. వైయస్ జగన్ ఇటీవల నంద్యాల మీటింగ్లో తెలిపిన నవ రత్నాల పథకాలకు ప్రజల్లో విశేష స్పందన వస్తుందని, అందరూ వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారని ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు.