రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కొల్లేరుపై సమగ్ర అధ్యయనం చేస్తాం
09 May 2018 7:14 PM
కృష్ణా జిల్లా: కొల్లేరుపై సమగ్ర అధ్యయనం చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. కొల్లేరు ప్రాంతాన్ని రీ సర్వే చేయించి భూములు వెనక్కి ఇప్పిస్తానని మాట ఇచ్చారు.
పెరికగూడెం వద్ద వైయస్ జగన్ను కొల్లేరు ప్రాంతవాసులు కలిశారు. ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు పరిమితం చేయాలని కొల్లేరు వాసులు వైయస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణల పేరుతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. 750 ఎకరాల జీరాయితీ భూమిని నాశనం చేశారని కొల్లేరు వాసులు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. జీరాయితీ భూమిని తిరిగి ఇప్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కొల్లేరువాసుల సమస్యలపై వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు. కొల్లేరువాసులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. వైయస్ జగన్ హామీతో కొల్లేరు వాసులు హర్షం వ్యక్తం చేశారు.