భరత్‌ను చట్టసభలో కూర్చోబెడతా


ప్రకాశం: గొట్టిపాటి భరత్‌ నాకు తమ్ముడిలాంటి వ్యక్తి అని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం ఇంకొల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే జిల్లా నుంచి మొట్ట మొదట ఎమ్మెల్సీగా భరత్‌ను తీసుకొచ్చి చట్టసభలో కూర్చోబెడతానని చెప్పారు. ఎల్లప్పుడు నా గుండెల్లో భరత్‌కు స్థానం ఉంటుందని, ఆ కుటుంబానికి తోడుగా ఉంటానని జననేత వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
Back to Top