జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
చిన్నారికి ఆపరేషన్ చేయిస్తానని జననేత హామీ
07 Jun 2018 12:38 PM
పశ్చిమగోదావరి: ఆరోగ్యశ్రీ ఉన్న ప్రయోజనం లేదు.. తమ బిడ్డకు ఆపరేషన్ చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారని పశ్చిమగోదావరి జిల్లా నడింపల్లికోటకు చెందిన శాంతి, శ్రీనివాస్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని ఆ దంపతులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యను చెప్పుకున్నారు. తమ చిన్నారికి పుట్టుక నుంచి మూగ, వినికిడి సమస్య ఉందని, ఆస్పత్రులకు వెళితే.. ఆరోగ్యశ్రీ పనిచేయదని చెబుతున్నారన్నారు. ఆపరేషన్ చేసుకోవడానికి రూ. 10 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారన్నారు. అంత స్తోమత లేదని, తమ బిడ్డకు ఆపరేషన్ చేయించాలని వైయస్ జగన్మోహన్రెడ్డిని ఆ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ మేరకు చలించిన వైయస్ జగన్ చిన్నారికి ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు.