స్టూడెంట్‌ ఒలంపిక్స్‌ విజేతకు వైయస్‌ జగన్‌ నజరానా

విజయవాడ: స్టూడెంట్‌ ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వీర్ల మహేష్‌బాబును వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. కృష్ణ జిల్లా కూడేరు గ్రామానికి చెందిన మహేష్‌బాబు జూలై నెలలో కొలంబోలో జరిగిన ఒలంపిక్స్‌లో డిస్కస్‌ త్రోలో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఈ మేరకు విజయవాడలోని వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మహేష్‌బాబు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మహేష్‌బాబును అభినందించి రూ.5 లక్షల ప్రోత్సాహకం అందించారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top