వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్ విగ్రహం ఆవిష్కరణ
27 Jan 2018 12:17 PM
- వైయస్ జగన్కు ఘన స్వాగతం
- అర్మేనుపాడులో పార్టీ జెండా ఆవిష్కరణ
నెల్లూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గుర్రంకొండ గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. గ్రామానికి చేరుకున్న జననేతకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. 72వ రోజు శనివారం సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం చిలమానుచేను క్రాస్రోడ్డు నుంచి వైయస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ప్రజల గోడు వింటూ ముందుకుసాగుతున్న జననేత వైయస్ జగన్కు స్థానికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. రుణాలు మాఫీ కాలేదని, ఫీజులు అందడం లేదని వాపోయారు. అక్కడి నుంచి ఆర్మేనుపాడు చేరుకున్న వైయస్ జగన్కు ప్రజలు, మహిళలు పెద్దసంఖ్యలో ఘనస్వాగతం పలికారు. ఆర్మేనుపాడులో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం భోజన విరామం తర్వాత కాండ్ర గ్రామం దగ్గర గూడూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టనుంది. అక్కడి నుంచి వెంకటేశుపల్లి మీదుగా తిమ్మసముద్రం క్రాస్ రోడ్డు వరకు వైయస్.జగన్ ప్రజాసంకల్పయాత్ర సాగనుంది.