వైయ‌స్ఆర్‌ విగ్రహం ఆవిష్కరణ


- వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
- అర్మేనుపాడులో పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ‌

నెల్లూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గుర్రంకొండ గ్రామంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్క‌రించారు. గ్రామానికి చేరుకున్న జ‌న‌నేత‌కు స్థానికులు  ఘనస్వాగతం పలికారు. 72వ రోజు శనివారం సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం చిలమానుచేను క్రాస్‌రోడ్డు నుంచి వైయ‌స్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ప్రజల గోడు వింటూ ముందుకుసాగుతున్న జననేత వైయ‌స్‌ జగన్‌కు స్థానికులు త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు. రుణాలు మాఫీ కాలేద‌ని, ఫీజులు అంద‌డం లేద‌ని వాపోయారు. అక్క‌డి నుంచి ఆర్మేనుపాడు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్రజలు, మహిళలు పెద్దసంఖ్యలో ఘనస్వాగతం పలికారు. ఆర్మేనుపాడులో వైయ‌స్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం భోజన విరామం తర్వాత కాండ్ర గ్రామం దగ్గర గూడూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టనుంది. అక్కడి నుంచి వెంకటేశుపల్లి మీదుగా తిమ్మసముద్రం క్రాస్ రోడ్డు వరకు వైయ‌స్.జగన్‌ ప్రజాసంకల్పయాత్ర సాగనుంది.

Back to Top