వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వర్షంలోనే జననేత పాదయాత్ర
18 Aug 2018 12:10 PM
విశాఖ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైయస్ జగన్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు కూడా ఆయనపై ఉన్న అభిమానంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాజన్న బిడ్డ వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు. జననేతను కలిసి సమస్యలు చెప్పుకుంటున్నారు. 239వ రోజు జననేత పాదయాత్ర నర్సీపట్నం నియోజకవర్గంలోని ములగపూడి శివారు నుంచి ప్రారంభించారు. మెట్లపాలెం క్రాస్ మీదుగా బెన్నవరం చేరుకున్నారు. తమ కష్టాలు తెలుసుకునేందుకు వస్తున్న రాజన్న బిడ్డకు మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. రోడ్డుపై చీరలు పరిచి నడిపించారు. మధ్యాహ్నం తరువాత వైయస్ జగన్ బల్లిఘట్టంకు చేరుకుంటారు. సాయంత్రం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.