ప్ర‌జా స‌మ‌స్య‌లు వింటూ ముందుకు వెళ్తున్న జ‌న‌నేత‌

ఒంగోలు: పాద‌యాత్ర‌గా వ‌స్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున క‌లుస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. బాబు పాల‌న‌లో ప‌డుతున్న బాధ‌ల‌ను విరిస్తున్నారు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని రైతులు, పింఛ‌న్ రావ‌డం లేద‌ని విక‌లాంగులు, వృద్ధులు వారి బాధ‌లు చెప్పుకుంటున్నారు. మ‌రికొంద‌రు త‌మ రేష‌న్ కార్డును తీసేశార‌ని, తాము అన్నానికి కూడా ఇబ్బందులు ప‌డుతున్నామ‌న్నారు. వారి బాధ‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్  ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న న‌డుస్తోంద‌ని, ఈ పాల‌న‌ను త‌రిమి కొట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. మ‌న‌మంతా క‌లిసి ఈ దుర్మార్గ పాల‌న‌పై పోరాటం చేసి రాజ‌న్న రాజ్యం తెచ్చుకుందామ‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. 
Back to Top