వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం
20 Nov 2017 4:49 PM
–వైయస్ జగన్ మోహన్ రెడ్డి
కర్నూలు: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గోవిందిన్నెలో వైయస్ జగన్ మోహన్రెడ్డిని విద్యార్థి జేఏసీ నాయకులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఉద్యమకారులపై చంద్రబాబు అణచివేత ధోరణిని వైయస్ జగన్కు విద్యార్థి జేఏసీ నాయకులు వివరించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కంటూ ప్లకార్డు పట్టుకుని విద్యార్థులతో కలిసి వైయస్ జగన్ నడిచారు. హోదా కోసం ఉద్యమించిన వారిని నిర్భందించడం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం తాను ఉద్యమించినట్లు విద్యార్థులకు వైయస్ జగన్ వివరించారు. అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించి ప్రత్యేక హోదా సాధించుకుందామని జననేత పిలుపునిచ్చారు. వైయస్ జగన్ హామీతో విద్యార్థి జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.