మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
జననేతకు బ్రహ్మరథం
08 Nov 2017 10:36 AM
వైయస్ఆర్ జిల్లా: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వైయస్ఆర్ జిల్లాలో విశేష స్పందన వస్తోంది. ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు పనులు మానుకొని జననేత కోసం ఎదురెళ్లి స్వాగతాలు పలుకుతున్నారు. ఈ నెల 6న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం మూడో రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 8.40 గంటలకు నేలతిమ్మాయిపల్లి వైయస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. గ్రామంలో జెండాను ఆవిష్కరించి ముందుకు కదిలారు. జననేత వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. రోడ్డుకు ఇరువైపులా నిలిచిన ప్రజలు ప్రత్యేకించి యువతరం వైయస్ జగన్మోహన్రెడ్డితో కరచాలనాలు, సెల్ఫీల కోసం పెద్దఎత్తున పోటీపడ్డారు. అడుగు తీసి అడుగేయడానికే వీల్లేకుండా సెల్ఫీలు తీసుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు.
దారిపొడవునా ఎటుచూసినా జనమే..
వైయస్ జగన్ పాదయాత్రగా వస్తున్న దారిపోడువునా జననే జనం. దూరం నుంచి చూసే వారికి చీమలవరుసలా బారులు తీరిన జనప్రభంజనమే కనిపించింది. ప్రతి ఊరి శివారులో మహిళలు ముగ్గులు వేసి తమ అభిమాన నేతకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి.. కుంకుమ తిలకాలు దిద్దుతున్నారు. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో వైయస్ జగన్ పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకొని స్వయంగా నోటు చేసుకుంటున్నారు. ఆయన్ను కలిసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వస్తుందని, మంచి రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.