రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ప్రజాసంకల్పయాత్ర@1800 కిలోమీటర్లు
18 Apr 2018 12:54 PM
- వైయస్ జగన్ పాదయాత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం
- గణపవరం వద్ద మొక్క నాటిన వైయస్ జగన్
- మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఆవిష్కరణ
కృష్ణా జిల్లా: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. కృష్ణా జిల్లా గణపవరం వద్ద 1800 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్ మరో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకోంది. 1800 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి కావడంతో గ్రామస్తులు జననేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి రాజన్న బిడ్డకు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలోకి చేరుకున్న వైయస్ జగన్ ఓ మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే వైయస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి 139వ రోజు ప్రజాసంకల్పయాత్ర బుధవారం ఉదయం మైలవరం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి చిన్న నందిగాం క్రాస్, వెల్వడం, గణపవరం అడ్డరోడ్, గణపవరం వరకు చేరుకున్నారు. ఎండలు మండుతున్నా లెక్క చేయకుండా వైయస్ జగన్ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయన వెంట నడించేందుకు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారందరితో కలిసి జననేత ముందుకు సాగుతున్నారు.
వైయస్ జగన్ 2017 నవంబర్ 6న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం విదితమే.180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఇప్పటి వరకు వైయస్ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్ర పూర్తికాగా ఈ నెల 14న ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలోని ప్రవేశించింది.
ప్రజాసంకల్పయాత్ర సాగుతుందిలా...
0 - వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబరు 6, 2017)
100 - కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబరు 14, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్ నియోజకవర్గం ముద్దవరం (నవంబరు 22, 2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబరు 29, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్ 7,2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబరు 16, 2017)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్ రోడ్స్ (డిసెంబరు 24, 2017)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, కొరిమెర్ల (ఫిబ్రవరి 7, 2018)
1200 - ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామకృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1400 - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం నాగులపాడు (మార్చి 5, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1600- గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని సుల్తానాబాద్( ఏప్రిల్7-2018)
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గణపవరం( ఏప్రిల్ 18-2018)