వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఒంటరి పోరు
05 Jun 2018 4:59 PM
ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఒంటరి పోరాటం చేస్తుందని, అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దని వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైయస్ఆర్సీపీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సజ్జల పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కరుడు గట్టిన విలన్లా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సరైన వ్యక్తులను బూత్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాలని సూచించారు. వైయస్ జగన్ చెబుతున్న నవరత్నాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాలని వివరించారు. ఎప్పటికప్పుడు భ్రమలు కల్పించి పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని అబద్దాలు ప్రచారం చేస్తూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.