కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
'ప్రజల పక్షాన పోరాడుతున్న ఘనత వైఎస్ జగన్ చెందుతుంది'
24 Aug 2015 8:19 PM
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసుపై ఉన్న శ్రద్ధ చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై లేదని ఆయన సోమవారమిక్కడ మండిపడ్డారు. ఎన్నికల ముందు పది సంవత్సరాలకు ప్రత్యేక హోదా తెస్తానని చంద్రబాబు చెప్పారని ఈ సందర్భంగా మిథున్ రెడ్డి గుర్తు చేశారు.
ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదాపై ఒత్తిడి తేవడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్న ఘటన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదని, ప్రత్యేక హోదా కోసం ఈ నెల 29న వైఎస్ఆర్ సీపీ తలపెట్టిన ఏపీ బంద్ను విజయవంతం చేయాలని మిథున్ రెడ్డి కోరారు.