అంబేద్క‌ర్‌ చూపిన బాటలో నడుద్దాం

వైయస్ఆర్ జిల్లాః డా. బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఘన నివాళులర్పించారు. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ లో వైయస్ జగన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన చూపిన బాటలో మనమంతా నడవాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేందుకు మనమందరం ప్రయత్నించాల'ని వైయస్ జగన్‌ ట్వీట్‌ చేశారు.



పులివెందుల నియోజకవర్గంలో వైయస్ జగన్ రెండ్రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ, కష్టాల్లో ఉన్న కుటుంబాలను పరామర్శించి వారికి తోడుగా నిలుస్తూ భరోసానిస్తున్నారు.
Back to Top