వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు వైయస్ జగన్
21 Dec 2016 3:25 PM
తిరుపతి: విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని, అందుకే ఎన్నికల సమయంలో అబద్ధాల హామీలను ఇవ్వలేదని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడిలా అబద్ధాల హామీలు ఇచ్చుంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పారు. దివంగత మహానేత వైయస్ఆర్ ఆశయాల సాధన కోసం వైయస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని భూమన చెప్పారు. వైఎస్ఆర్ మరణవార్తను విని 700 మంది చనిపోయారని పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని అప్పట్లో వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిరస్కరించారని తెలిపారు. అయినా వైయస్ జగన్ ధైర్యంగా బాధిత కుటుంబాలను ఓదార్చారని, ఇది ఆయనకున్న నిబద్ధత అని భూమన అన్నారు.