వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ను కలిసిన రజకులు
04 Apr 2018 12:12 PM
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో రజకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు జననేతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ..రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాలపై సాధ్యాసధ్యాలను పరిశీలించి రాజ్యంగ నిపుణులతో కమిటీ వేయాలన్నారు. 45 సంవత్సరాలు నిండిన రజక వృత్తిదారులకు రూ.2500 పింఛన్ నేతన్నలు, గీతన్నల మాదిరిగా ఇవ్వాలని కోరారు. రజకులపై రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టేందుకు సామాజిక రక్షణ హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు. మండలస్థాయిలో రజక పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. సాంప్రదాయ రజక వృత్తిని యంత్రీకరించి ఆధునీకరించాలన్నారు. అన్యాక్రాంతమవుతున్న రజక వృత్తి చెరువులను, దోభీఘాట్లను పరిరక్షించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు, దేవాయాలయాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో దోభీ పోస్టులను రజకులకు మాత్రమే కేటాయించాలని వినతిపత్రంలో కోరారు. వీరి సమస్యలు విన్న వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే రజకులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.