మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
రైతులను ఆదుకునే ప్రభుత్వం వస్తుంది
22 May 2018 2:56 PM
– భరోసా కల్పించిన జననేత
పశ్చిమ గోదావరి జిల్లా: రైతులను ఆదుకునే ప్రభుత్వం వస్తుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, నష్టపోయేది మేమేనని, చేసేది మేమేనని వారు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. 168వ రోజు ప్రజా సంకల్ప యత్రలో భాగంగా వైయస్ జగన్ను కౌలు రైతులు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కౌలు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతు ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని పేర్కొంది. ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి అవుతుందని, 40 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పారు. కౌలు 15 బస్తాలు చెల్లించాల్సి వస్తుందని, నష్టపోతుంది కౌలు రైతే అని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ మీకు గిట్టుబాటు ధర కావాలి అంతే కదా? కౌలు రైతుకు మేలు జరగాలంటే ప్రయోజనాలు డైరెక్టుగా అందాలన్నారు. గిట్టుబాటు ధర రూ.1550 అయితే మనకు వెయ్యి కూడా రావడం లేదన్నారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు..మద్దతు ధర కూడా లేదని పేర్కొన్నారు. బ్యాంకులోళ్లు డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులకు కౌలు కార్డులు లేవు..బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా కౌలు రైతులకు వైయస్ జగన్ భరోసా కల్పించారు.