రొయ్యల చెరువు క్షేత్రాన్ని సంద‌ర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌

 


ప‌శ్చిమ గోదావ‌రి : ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించారు. రొయ్యల చెరువులో చేపలు, రొయ్యలకు మేత వేసిన స్వయంగా జననేత వైయ‌స్‌ జగన్.. వల వేయడంతో చేపలు, రొయ్యలు పట్టడం ఎలాగో వారిని అడిగి తెలుసుకున్నారు. రొయ్యలు, చేపల ధరలు ఎందుకు పడిపోతున్నాయో రైతులు రాజ‌న్న బిడ్డ‌కు  వివరించారు. తమను దళారులు ఏ విధంగా దోచుకుంటున్నది ఆక్వా రైతులు వైయ‌స్‌ జగన్‌కు వివరించారు. వ్యాపారులు సిండికేట్ అయ్యి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. ఈ సిండికేట్‌లో ప్రధాన భాగస్వామి అధికార పార్టీకి చెందిన నేత చింతమనేని ప్రభాకర్ అని వైయ‌స్‌ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. జననేత వారికి ధైర్యం చెప్పి, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామని.. రైతులు గిట్టుబాటు ధర వచ్చేవరకు తమ పంటను కోల్డ్ స్టోరేజ్ లో దాచుకోవచ్చని చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీలు 4.75 పైసలు నుండి 1.50 పైసలు వరకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.   

Back to Top