ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఒలింపిక్ డే సంబ‌రాలు




 
 
తూర్పు గోదావ‌రి : వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో శనివారం ఒలింపిక్‌ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైయ‌స్‌ జగన్‌ చింతపల్లి వద్ద ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించారు. అనంతరం జననేత జెండా ఊపి ఒలింపిక్‌ రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, క్రీకాకారులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
Back to Top