భీమనపల్లి నుంచి 201వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
తూర్పు గోదారి : వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జ‌న‌నేత‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 201వ రోజు శనివారం ఉదయం భీమనపల్లి శివారు నుంచి ప్రారంభ‌మైంది.  అక్కడి నుంచి సింగాయపాలెం, అనంతవరం, మహిపాల చెరువు చేరుకుని అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతవరం శివారు వద్ద వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించినుంది. విరామం అనంతరం పాదయాత్ర తిరిగి 2.45కు ప్రారంభమౌతుంది. బొండయకొడు, కొండలమ్మచింత మీదుగా ముమ్మిడివరం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ముమ్మిడివరం హైస్కూల్‌ సెంటర్‌ వద్ద జరిగే బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  

తాజా వీడియోలు

Back to Top