కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ప్రణబ్ జీ.. విచారణ జరిపించండి..!
20 Dec 2015 11:59 PM
రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న కాల్ మనీ సెక్సు రాకెట్ విషయంలో సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విన్నవించారు. నిబంధనలకు విరుద్దంగా శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే రోజా మీద సస్పెన్షన్ ఎత్తివేసేలా స్పీకర్ కు సూచించాలని ఆయన కోరారు. సికింద్రాబాద్ లోని బొల్లారం అతిథి నివాసంలో శీతాకాలపు విడిది చేసిన రాష్ట్రపతిని వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కాల్ మనీ సెక్సు రాకెట్ తో పాటు తెలుగుదేశం సాగిస్తున్న దురాగతాల మీద ఒక వినతి పత్రం సమర్పించారు. దీంతో పాటు బాక్సైట్ గనులు, ప్రత్యేక హోదా మీద వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు.