పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
ఎమ్మెల్సీ బోస్ కు వైఎస్ జగన్ పరామర్శ
21 Apr 2016 12:11 PM
హైదరాబాద్: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పిల్లి సుభాస్ చంద్రబోస్ ను పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పరామర్శించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన బోస్ దివంగత వైఎస్సార్ హయంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ జగన్ కోసం మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేసిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. తర్వాత కాలంలో బోస్ సేవలకు గాను ఎమ్మెల్సీ పదవిని ఆయనకు కేటాయించటం జరిగింది. కొంత కాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. రక్తనాళాల్లో సమస్య ఉండడంతో బోస్కు శస్త్ర చికిత్స నిర్వహించి రెండు స్టెంట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి, సునీల్లు ఉన్నారు.