జాతీయ నేతల్ని కలుస్తున్న వైయస్ జగన్

న్యూఢిల్లీ)) ప్రత్యేక హోదా ను కోరుతూ జాతీయ పార్టీ నాయకుల్ని ప్రతిపక్ష నేత,
వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ కలుస్తున్నారు. ఉదయమే సీపీ ఐ పార్టీ జాతీయ
కార్యదర్శి రాజాను కలిశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరం అని, ఇందుకోసం
కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు కలిసి రావాలని ఆయన కోరారు. వైయస్ జగన్ వెంట
పార్టీ ఎంపీలు ఉన్నారు. మధ్యాహ్నం సీపీఎం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అగ్ర
నేతల్ని కలవనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ని కలిసి వైయస్ జగన్
వినతి పత్రం అందించి వచ్చారు.

 

Back to Top