25న ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం

హైదరాబాద్ః పార్టీ అధ్య‌క్షులు వైయస్ జగన్ అధ్యక్షతన ఈనెల 25న  ఉ. 11:30 గం.ల నుండి మ.1:00 గం.ల వ‌ర‌కు పార్టీ ''రాష్ట్ర ముస్లిం మైనార్టీ ముఖ్య నాయ‌కుల స‌మావేశం'' పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరగనుంది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి అంశాల‌మీద పార్టీ మేనిఫెస్టోను నిర్ణ‌యించే బాధ్య‌తను నాయ‌కుల‌కు అప్పగిస్తారు. ముస్లిం, మైనార్టీ డిక్ల‌రేష‌న్‌లో ఏమి ఉండాలి అనే అంశం మీద సూచ‌న‌లు, స‌ల‌హాలు ప్ర‌జ‌ల నుంచి, ఆయా వ‌ర్గాల నుంచి తీసుకునే బాధ్య‌తను కూడా వారికి ఇవ్వనున్నారు. 

తాజా వీడియోలు

Back to Top