ఏడాది ఓపిక పట్టండి


-  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా
- ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఆత్మీయ స్వాగ‌తం
కర్నూలు: చ‌ంద్ర‌బాబు హ‌మీల‌తో మోస‌పోయిన ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ఏడాది ఓపిక ప‌ట్టండి మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, అంద‌రికి న్యాయం జ‌రుగుతుంద‌ని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌.జా సంక‌ల్ప యాత్ర‌కు క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. రాజ‌న్న బిడ్డ‌కు ప్ర‌జ‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. బుధ‌వారం ఉద‌యం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తొమ్మిదవ రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. ఆర్.కృష్ణాపురం నుంచి  వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్ర మొదలుపెట్టగానే వృద్ధులు, మహిళలు.. ఆయ‌న్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కర్నీ జ‌న‌నేత ఆప్యాయంగా పలకరిస్తూ ...ఏడాది ఓపిక పట్టండి, ప్రజాప్రభుత్వం వస్తుందని.....అందరి కష్టాలు తీరుతాయని భరోసా కల్పిస్తున్నారు. వ‌క్కిలేరు వాగు వ‌ద్ద జ‌నం ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం  పెద్దకోట కందుకూరు చేరుకున్న వైయ‌స్‌ జగన్‌కు గ్రామస్తులు పూల‌వ‌ర్షం కురిపించారు. రహదారులన్నీ బురదమయం అయినా, అదే రోడ్లపై వెళ్లి ఆయన స్థానికుల్ని పలకరించారు. అంతేకాకుండా వయోభారంతో తన వద్దకు రాలేని వారిని ...అక్కడకు వెళ్లి మరీ పలకరించారు. టార్పాలిన్‌నే పైకప్పుగా చేసుకున్న నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. అలాగే వృద్ధులకైతే పింఛన్‌, రేషన్‌పై హామీ ఇస్తున్నారు. తనను కలిసిన మహిళలకు ....అమ్మ ఒడి పథకంతో చిన్నారులను చదివించే బాధ్యత తనదని హామీ ఇస్తున్నారు. సంక్షేమ రాజ్యమే లక్ష్యంగా రాబోయే రాజన్నరాజ్యం ఉంటుందని ప్రతిఒక్కరికీ చెబుతూ జ‌న‌నేత‌ ముందుకు సాగుతున్నారు.
Back to Top