గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైయస్ఆర్సీపీ కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా రేపు (సోమవారం) ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప మానవహారం నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు వద్ద వైయస్ జగన్ మానవహారంలో పాల్గొననున్నారు. ఈ మానవహారం కార్యక్రమానికి మేధావులు, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పిలుపునిచ్చారు. <br/><br/>