వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్..!

గుంటూరుః ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగోరోజుకు చేరింది. ఈసందర్భంగా  గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు డా. క్రీస్తుదాస్ జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం బాగా నీరసించిందని తెలిపారు. జగన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 


బీపీ 129/90, షుగర్ లెవల్స్ 87 ఎంజీ, పల్స్ 66 ఉంది. దీక్ష కారణంగా వైఎస్ జగన్ బాగా నీరసించిపోయారని, పల్స్ రేటు గంట గంటకు పడిపోతుందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రత్యేకహోదాని సాధించేందుకు వైఎస్ జగన్ మొక్కవోని దీక్షతో పోరాటం కొనసాగిస్తున్నారు. ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. 
 
Back to Top