గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వైయస్ జగన్

వైయస్సార్ జిల్లా(ఇడుపులపాయ): ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గడపగడపలో వైయస్సార్ కాంగ్రెస్ నినాదంతో ఇడుపుల పాయ గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లారు. ఈసందర్భంగా స్థానిక ప్రజలు వైయస్ జగన్ కు బ్రహ్మరథం పట్టారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. మహిళలు జననేతకు హారతి ఇచ్చారు.  బాబు అవినీతి, మోసపూరిత పాలనను గడపగడపకు వైయస్ జగన్ వివరిస్తున్నారు.  బాబు రెండేళ్ల పాలనకు సంబంధించి వంద ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ ను వారికి అందించారు. అదేవిధంగా ఈరెండేళ్లలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వైయస్సార్సీపీ చేసిన పోరాటాలను తెలియజేశారు.

తాజా వీడియోలు

Back to Top