వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ కీలక భేటీ
22 Apr 2018 8:36 PM
కృష్ణా జిల్లా : ప్రత్యేక హోదా ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన ఎంపీలు, పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో అగిరిపల్లిలో ఆదివారం సమావేశమయ్యారు. సాయంత్రం మొదలైన భేటీ ఇంకా కొనసాగుతోంది.
సమావేశం ముగిసిన తర్వాత రాజీనామా చేసిన ఎంపీలు మీడియా సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదంతో హోదాపై పోరుబాట పట్టిన వైయస్ఆర్ సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో భేటీ అయిన వైయస్ జగన్ స్థానికంగా ప్రజల అభిప్రాయాలను నేతల నుంచి తెలుసుకుంటున్నారు. ఏపీకి హోదా కోసం గత పార్లమెంటు సమావేశాల్లో 13 సార్లు కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశిపెట్టిన వైయస్ఆర్సీపీ ఎంపీలు ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
ప్రత్యేక హోదాపై పోరాడే పార్టీలు, పక్షాలు, ప్రజా సంస్థలను కూడా ఏకతాటిపైకి తెచ్చి ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు కూడా వైయస్ఆర్సపీ యోచిస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు, ప్రజా సంఘాలు చేసిన దీక్షలకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.