ముస్లింలకు వైయస్ జగన్ శుభాకాంక్షలు

 పవిత్రమైన
రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైయస్ ఆర్‌
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు/వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య పవిత్ర మాసాన్ని
ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకుంటారని, వారికి అల్లాహ్‌ దీవెనలు
లభించాలని ఆయన ఆకాంక్షించారు.

మహనీయుడైన
మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలోనే కావడంతో
ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని పేర్కొన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస
దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని
చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప
పండుగ రంజాన్‌ అని ఆయన అన్నారు.

తాజా వీడియోలు

Back to Top