వైయస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: క్రిస్మస్‌ సర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగురాష్ట్రాల క్రైస్తవులందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ‘సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం’ ఇవన్నీ జీసస్‌ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత సందేశాలని వైయస్‌ జగన్‌ అన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని జననేత పేర్కొన్నారు. 
Back to Top