విశాఖకు బయలుదేరిన వైయస్ జగన్

విశాఖపట్నం: వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విశాఖ బయలుదేరారు. ఇందుకోసం కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో వైయస్ జగన్ పాల్గొంటారు. ప్రత్యేక హోదా కోసం వైయస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

Back to Top